PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైన‌ర్ బాలిక పై అత్యాచారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మైనర్‌ బాలికపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి.. అఘాయిత్యానికి ఒడిగట్టారు. తిరుపతి జిల్లాలోని ఎంఆర్ రాజుల కంట్రిగ గ్రామంలో గురువారం వినాయక నిమజ్జనం సదర్భంగా ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామస్థులు. ఆ ఊరేగింపును చూసేందుకు గ్రామ ప్రజలంతా ఇంటి నుంచి బయటకు వచ్చారు. స్వామి వారి అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్నారు. అందరిలాగే ఓ మైనర్ బాలిక కూడా బయటకు వచ్చింది. ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ బాలికపై కొందరు యువకులు కన్నేశారు. జనం మధ్యలో దూరి.. ఎవరి కంటా పడకుడా.. ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. చీమ కుట్టినట్లు ఉండటంతో ఆ బాలిక పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె మత్తులోకి వెళ్లింది. అనంతరం కామోన్మాదులు ఆమెను పక్కనే ఉన్న చెట్టు పొదల్లోకి తీసుకెళ్లారు. ఒకరి తరువాత మరొకరుగా అత్యాచారం చేసినట్లు సమాచారం.

                                         

About Author