PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రికార్డు స్థాయిలో విశాఖ‌ ఉక్కు అమ్మ‌కాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖ‌ ఉక్కు క‌ర్మాగారం ఉక్కు అమ్మ‌కాల్లో రికార్డు నెల‌కొల్పింది. 2021-22 ఆర్థిక సంవత్స రం మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.19,370 కోట్ల విలువైన ఉత్పత్తులు విక్రయించిందని సంస్థ సీఎండీ అతుల్‌ భట్‌ వెల్లడించారు. 2021 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 38.8 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగా, అందులో 37.3 లక్షల టన్నులు విక్రయించామన్నారు. ఇది అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 69 శాతం అధికమన్నారు. కొవిడ్‌ను అధిగమించి ముందుకు వెళుతున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. ప్రతి ఏడాది చివరి త్రైమాసికం చాలా కీలకమని, అమ్మకాలు మరింత పెంచేందుకు, మార్కెట్లో నిలదొక్కుకునేందుకు సంఘటితంగా కృషి చేయాలన్నారు.

                                

About Author