PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీ నిధులు 30 లక్షలతో రోడ్డు నిర్మాణం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: మండల పరిధిలోని రోళ్ళ పాడు శ్రీ బరక సంజీవరాయ స్వామి దేవస్థానంలో పర్యాటకుల సౌకర్యార్థం నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గతంలో మంజూరు చేసిన 30 లక్షల నిధులతో ఆలయంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు నందిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డినిఆలయ ధర్మకర్త పేరెడ్డి వెంకట రామిరెడ్డి మరియు ప్రజలు అభినందించారు.తర్వాత చెరుకుచెర్ల గ్రామంలో నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సోదరుని కుమారుడు పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,రోళ్ళపాడు మాజీ సర్పంచ్ పేరెడ్డి వెంకటరామిరెడ్డి,వనం వెంకటరెడ్డి,దాసి కృష్ణారెడ్డి,వైసిపి నాయకులు ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి,రమణారెడ్డి,గుండం పెద్ద పుల్లారెడ్డి,ఏఎస్ఐ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author