ఎస్పీ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు !
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/09/6595.jpg?fit=500%2C280&ssl=1)
పల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై టూటౌన్ పీఎస్లో కేసు నమోదైంది. డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 167, 177, 182, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదైంది. డీఐజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని సీఐ శివరాముడు తెలిపారు.