PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీజ్ చేసిన అక్రమ కర్ణాటక మద్యం ధ్వంసం

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలో దొరికి సీజ్ చేసిన అక్రమ కర్ణాటక మద్యం, నాటుసారా ను ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అనంతరం డిఎస్పీ సీతారామయ్య మాట్లాడుతూ 8 కేసులలో అందులో 7  కేసులు కర్నాటక మద్యం, ఒక కేసు నాటు సారాయి ఉన్నాయని తెలిపారు. 7 కేసులకు గాను మొత్తము 47 బాక్స్ లలో  4517 – 90 ఎం‌ఎల్ బుడ్డిలు ఒరిజినల్ చాయిస్ డీలక్స్ వ్హిక్సీ మొత్తము 406.08 టెట్రా పాకెట్స్ విలువ రూ 3,24,86, ఒక కేసులో 05 లీటర్ల  అరాక్ ను ధ్వంసం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా కర్నాటక నుంచి మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో మంత్రాలయం సిఐ ఏర్రిషావలి, మాధవరం ఎస్సై కృష్ణ మూర్తి, చెక్ పోస్టు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author