PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి, జనసేన కి షాక్.. 

1 min read

200 మంది కూటమి కార్యకర్తలు టిడిపిని వీడి వైసీపీలో చేరిక

పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన వైసిపి ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం వదర్లపాడు గ్రామం నుంచి 200 మంది తెలుగుదేశం మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు కైకలూరు ఏలూరు రోడ్ లోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరావు  (DNR), ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి  కారుమూరి సునీల్ కుమార్ సమక్షంలో చేరారు. గ్రామ వైస్సార్సీపీ నాయకులు ఘంటసాల సురేష్, వడుపు యేసుబాబు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కండువాలు వేసుకున్నారు. మాజీ సర్పంచ్లు పోతగాని వీరయ్య, పెరుగు వెంకన్న,  ఉపసర్పంచ్ వెలివెల నాగరాజు వారి అనుచరులతో తెలుగుదేశం,జనసేన పార్టీలను వీడి వైస్సార్సీపీ లోకి చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం పడుతుంది. అలాగే మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ని గేలిపించుకుందమన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసే వరకు మనందరం కృషి చేద్దాం అన్నారు.

About Author