PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైకాపా నేతలు చంద్రబాబుపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు..

1 min read

విలేకరుల సమావేశంలో ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్

రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే టిడిపి, జనసేన, బిజెపి, పొత్తులో విజయం సాధించాలి

టిడిపి పార్లమెంట్ ఇంచార్జ్ గన్ని వీరాంజనేయులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : టీడీపీ, జనసేన, బీజేపీ పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ను  అందరికీ పరిచయం చేస్తూ,టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జ్ గన్ని వీరాంజనేయులు సోమవారం ఉదయం  హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రం ఎంత వెనకబాటుకు గురైందో మాకంటే మీడియా మిత్రులకు మీకే బాగా తెలుసునని, ఏలూరు పార్లమెంట్ పరిధిలో పోలవరం, కోల్లేరు, అక్వా లాంటి వాటి పరిస్థితి అగమ్య గొచరంగా మారిందన్నారు. ఇవ్వన్నీ కూడా రాష్ట్రంలో ప్రగతి పథం లో ముందుకు సాగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి విజయం చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా ఫెంక్షన్ లు ఇంటికి వచ్చి ఇవ్వడం కుదరకపోవచ్చని అధికారులు చెపుతుంటే దానిని కూడా టీడీపీ పై, చంద్రబాబు పై రుద్దడానికి వైసీపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ప్రజలు అందరు ఈ విషయాన్నీ గమనించాలని తెలియజేసారు. వైసీపీ నాయకులు చంద్రబాబుపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసందర్భంగా ఉమ్మడి కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ నిన్న మొన్న పార్ల మెంట్ స్థాయి  టిడిపి జనసేన బిజెపి కూటమి ఎంఎల్ ఏ అభ్యర్థులతోను అసెంబ్లీ నియోజక వర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో  పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరులోఉన్న మీడియా మిత్రులు తనను ఒక అన్నగా తమ్ముడిగా ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పుప్పాల జగదీష్ బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author