PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌంటింగ్ ఏజెంట్లకు తగు సూచనలు: గౌరు, జయసూర్య

1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వచ్చేనెల 4వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నంద్యాలలో ఉన్నందున ఆ రోజున కౌంటింగ్ లో ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సలహాల గురించి టిడిపి ముఖ్య కార్యకర్తలకు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి, ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య ఏజెంట్లకు సూచించారు.మంగళవారం ఉదయం 10 గం.కు నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గౌరు వెంకటరెడ్డి టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డిని ఏజెంట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.కాతా రమేష్ రెడ్డి స్వగృహంలో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయులతో కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాతా రామచంద్ర రెడ్డి,కాతా రాజారెడ్డి,కాతా మోహన్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ నారాయణ, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనారాయణ,ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author