ఉపపోరు నుంచి తప్పుకున్న టీడీపీ
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/10/7305.jpg?fit=500%2C333&ssl=1)
పల్లెవెలుగువెబ్: తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గురువారం కీలక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ తెలంగాణ శాఖ (టీ టీడీపీ) నిర్ణయించింది. ఈ మేరకు టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు గురువారం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.