PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడీపీ జెండా ఎగరడం ఖాయం:గిరీశ్వర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా నందికొట్కూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని జూపాడుబంగ్లా మండల కేంద్రం పార్టీ కార్యాలయంలో నంద్యాల జిల్లా టిడిపి అధికార ప్రతినిధి గిరీశ్వర్ రెడ్డి పాత్రికేయులతో అన్నారు.జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు ప్రజలందరూ చరమగీతం పాడాలని ఈ ఓటుతో సమాధానం చెప్పారని టిడిపి గెలుపు ఖాయమని అన్నారు.జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా 3వ తేదీన నంద్యాలకు బయలు దేరాలని ఎలాంటి గొడవలకు దారి తీయకుండా టిడిపి కౌంటింగ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. నంద్యాలపార్లమెంట్ టిడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ఏ ఏ బూతులో కౌంటింగ్ ఇస్తారో అక్కడ బాధ్యతగా కౌంటింగ్ పూర్తి అయ్యే ఉండాలన్నారు. నియోజకవర్గంలోనే 6 మండలాల్లో టిడిపి మెజార్టీ వస్తుందని వైసీపీ నాయకులు ఎలాంటి గొడవలు చేయడానికైనా వారు సిద్ధంగా ఉన్నారని టిడిపి కార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలని అన్నారు.టిడిపి భారీ మెజార్టీతో గెలుస్తుందని గట్టి నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలోజూపాడు బంగ్లా మండల కన్వీనర్ వెంకటేశ్వర్ల యాదవ్ టిడిపి నాయకులు మోహన్ రెడ్డి,కాంతు,పిక్కిలి వెంకటేశ్వర్లు,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author