PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  పాణ్యం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెంది 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు  మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు స్థాపించారన్నారు రాష్ట్రంలో పేద ప్రజలకు  కూడు గూడు గుడ్డ రెండు రూపాయలకే కిలో బియ్యం ధోవతి  చీర పేద వృద్ధులకు పింఛన్ ఆడపడుచులకు ఆస్తిలో  సమాన వాటా దేశ చరిత్రలో ఎక్కడలేని రిజర్వేషన్లు స్థానిక సంస్థల లో రిజర్వేషన్లు తీసుకువచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రాజ్యాంగ హక్కు కల్పించారు రాష్ట్రంలోఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలకు తాగునీరు సాగునీరు  అందించిన వ్యక్తి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన క్యాబినెట్లో బీసీలకు పెద్దపీట వేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం మండల వ్యవస్థను తీసుకొచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రంగ రమేష్ రమణమూర్తి జనసేన నాయకులు జగదీష్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఖాదర్ భాషా గుజ్జల  సుబ్బయ్య ప్రభాకర్ మహేష్ సుధాకర్ వెంకటాద్రి భాష సుబ్బయ్య ఇర్ఫాన్ శేఖర్ నాయుడు రామచంద్రుడు కిరణ్  రాజశేఖర్ సురేంద్ర పాల్గొన్నారు.

About Author