PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని సి క్యాంపు లో ఉన్న మామూరు మజీద్ లో ఆయన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఆయన ఫలహారం తినిపించి పవిత్రమైన రోజా దీక్షను విరమింప చేశారు. అనంతరం వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులతో మాట్లాడారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ఈ సందర్భంగా టీజీ భరత్ తెలిపారు. కర్నూల్ లోని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, సోదరీమణులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి తేనీటి విందులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు డిగ్జామ్ నాగరాజు, గున్నా మార్క్, మన్సూర్ ఆలీఖాన్, అబ్బాస్, రామాంజనేయులు, రాజశేఖర్ యాదవ్, జూటూరు రవి, రాజశేఖర్ రెడ్డి, బాలు, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

About Author