NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా గాయకుడు గద్దర్ మృతి తీవ్ర విషాదం

1 min read

– బైరెడ్డి రాజశేఖరరెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎన్నో విప్లవ గీతాలు వినిపించి ప్రత్యేక తెలంగాణ సాధనకు కృషి చేసిన ప్రజా గాయకుడు గద్దర్ మృతి తీరని విషాదం అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గద్దర్ మృతి పట్ల  సంతాపం తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ, ప్రజా గాయకుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసమే కాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్నో పాటలు పాడి పాలకులు  మెలుకొనెలా చేశారన్నారు. ప్రత్యేకంగా రాయలసీమ వెనుకబాటుతనం పై మేము చేసిన ధర్నాలు, దీక్షల్లో పాల్గొని మాకు అండగా నిలిచారు అని తెలిపారు. గద్దర్ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.

About Author