PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిల్లల ఆహార అలవాట్ల పై టీవీ ప్రకటనల ప్రభావం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై టీవీల్లో వస్తున్న ప్రకటనలు.. పిల్లలు మరింత జంక్ ఫుడ్ తినేందుకు కారణమవుతున్నట్టు దేశంలో 56 శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన లోకల్ సర్కిల్స్ ఇందుకు సంబంధించి ఓ సర్వే నిర్వహించింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలకు సంబంధించి ప్రకటనల ద్వారా పిల్లలను కంపెనీలు లక్ష్యంగా చేసుకోకుండా నిషేధం విధించాలని 92 శాతం మంది కోరుకుంటున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ సర్వే ఫలితాలను లోకల్ సర్కిల్స్ విడుదల చేసింది.

About Author