PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టి.జి భరత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు

1 min read

– సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు కొట్టివేస్తారన్న నేతలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం దీక్షలో 42 , 43 , 44 , 45 , 46 వార్డుల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ఎస్.వలి, రాజశేఖర్ రెడ్డి, సుంకన్న, టి.ఎన్.ఎస్.ఎఫ్ నగర అధ్యక్షుడు రాజ్ కుమార్, తదితరులు దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న క్వాష్ పిటిషన్ ద్వారా చంద్రబాబుపై నమోదు చేసిన కేసును కొట్టివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

About Author