PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా డీఎస్సీ పైన తొలి సంతకం అన్న హామీని నెరవేర్చాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన డివైఎఫ్ఐ టౌన్ జనరల్ బాడీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు టి.రమేష్ కుమార మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నరసింహ హాజరు కావడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. అదేవిధంగా ఈ జనరల్ బాడీ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు వెంకట చిరు అధ్యక్షత న నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతీ యువకులను నిరుద్యోగులను ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఇవ్వకుండా వారిని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని వారి ఓట్లతో తగిన బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపారు యువతీ యువకులను నిరుద్యోగులను మోసం చేసిన ఏ ప్రభుత్వం అధికారంలో ఎప్పటికీ ఉండదని మరోసారి ఈ ఎన్నికలతో చెప్పారు అన్నది అందరికీ తెలుస్తుంది. ఇప్పటికైనా వచ్చిన ప్రభుత్వమే నా యువతీ యువకులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అదేవిధంగా నే గా డీఎస్సీ పైన తొలి సంతకం అన్న హామీని ఈ కూటం ప్రభుత్వం నెరవేర్చాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్యగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో  కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About Author