NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ బీచ్ లో న‌ల్ల‌గా మారిన ఇసుక‌.. భ‌యంతో జ‌నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అందమైన విశాఖ బీచ్ ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఎప్పుడూ బంగారు వర్ణంలో మెరిసిపోయే విశాఖ బీచ్ ఇసుక.. శుక్రవారం ఉన్నట్లుండి నల్లగా మారిపోయింది. చాలా చోట్ల ఇసుకంతా నల్లకప్పు వేసినట్లు కనిపిస్తోంది. దీంతో బీచ్ కు వెళ్లిన స్థానికులు, పర్యాటకులు ఏం జరిగిందోనని భయపడిపోతున్నారు. ఉన్నట్లుండి ఇసుక నల్లగా ఎందుకు మారింది.. ఏమైనా ప్రమాదం ముంచుకొస్తుందా అని అటు వైపు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. ఐతే దీనిపై ఏయూ నిపుణులు స్పందించారు. బీచ్ లో ఇసుక నల్లబడటం వెనుక ఎలాంటి ప్రమాదం లేదని.. అయితే సముద్రంలోని మురికి ఒకేసారి బయటకు వచ్చినప్పుడు ఇలా ఇసుక నల్లగా కనిపించే అవకాశముందని చెబుతున్నారు.

                                    

About Author