PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వనియమ ప్రవర్తకుడు పరమాత్మ

1 min read

డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు

ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ సమస్త చరాచర జగత్తును సృష్టించి, లయము చేయు విశ్వ నియమ ప్రవర్తకుడు పరమాత్మ అని, ఆయనను తెలుసుకుని జీవించుటయే మానవ జీవిత పరమార్ధమని ప్రముఖ వ్యాఖ్యాత, సంస్కృత పండితులు డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం, బిల్లలాపురం గ్రామంలోని శివాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు చే‌సిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఇమ్మడి అనిల్ కుమార్, గ్రామ పెద్దలు భూమా రామకృష్ణా రెడ్డి, చింతా తిరుమలేశ్, ఇమ్మడి నాగ కృష్ణమ్మ, డాక్టర్ అపర్ణ, చిలకల నాగ లక్ష్మమ్మ, ఆంజనేయులు, ఇమ్మడి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author