PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామాల సంక్షేమానికి పట్టం కట్టాలి..

1 min read

– స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

పల్లెవెలుగు వెబ్ తెలంగాణ:  చంద్ర ఘడ్,కిష్టంపల్లి,ఈర్ల దిన్నె, నందిమల్ల ఎక్స్ రోడ్ ,  నందిమల్ల,మస్తీ పురం, సింగం పేట గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం అయిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సరళిపై, గ్రామ సమస్యలపై సమీక్షించారు అదే విధంగా కెసిఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి నీ ఉదృతంగా ముందుకు తీసుకెళ్లాలని, అందరూ విశ్రమించక శ్రమించాలి అని డాక్టర్ ఆంజనేయ గౌడ్ సూచించారు కేసీఆర్ పథకాలను ప్రతి ఇంటికి తెలియజేయాలని ప్రతి ఇంటిలోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అందుతున్నాయని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి క్లుప్తంగా తెలిసేటట్లు చేయాలని నాయకులకు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author