PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

40 ఏళ్లుగా దొంగ‌త‌న‌మే వృత్తి .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ద‌శాబ్ధాలుగా దొంగ‌త‌నం చేస్తూ చ‌రిత్ర సృష్టించాడో దొంగ‌. 40 ఏళ్లకు పైబడి దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ ప్రకాశ్ ను శనివారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. దొంగ ప్రకాష్‌ (54), కోలారు, శివమొగ్గ బళ్లారిలో మొత్తం మూడు వివాహాలు చేసుకోగా ఇతడికి 7 మంది సంతానం. ఇప్పటి వరకు ఇతనిపై 160 కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, కోలారు, బళ్లారి, శివమొగ్గ, చిత్రదుర్గ, గుల్బర్గా తో పాటు గోవా, కేరళలో చోరీలకు తెగబడ్డాడు. 20 సార్లకు పైగా జైలుకెళ్లి వచ్చాడు. 1978లో ప్రకాష్‌ 10 ఏళ్ల బాల్యంలోనే తొలి చోరీ చేశాడు. తరువాత సహోదరుడు వరదరాజ్, పిల్లలు బాలరాజ్, మిథున్, అల్లుడు జాన్‌ కలిశారు. ఈ నెల 22 తేదీన రాజాజీనగరలో ప్రకాష్‌ చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు.

                                          

About Author