PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటమి భయంతోనే..కూటమి కట్టారు..

1 min read

‘చేనేతపురి’లో.. జెండా ఎగరేస్తా…

  • సామాజిక న్యాయం పాటించిన ఏకైక ముఖ్యమంతి జగన్​ మోహన్​ రెడ్డి
  • మొదటిసారిగా చేనేత బిడ్డకు అవకాశం
  • ఆశీర్వదించి…గెలిపించండి…
  • ఎమ్మిగనూరును అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తా..
  • బుట్టా ఫౌండేషన్​ ద్వారా సేవలు… కొనసాగిస్తా…
  • వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక

పల్లెవెలుగు, ఎమ్మిగనూరు:సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓటమిభయంతోనే ప్రతిపక్షాలు (బీజేపీ–జనసేన–టీడీపీ) కూటమిగా జత కట్టాయన్నారు వైసీపీ ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టారేణుక. రైతులు, విద్యావంతులు, యువతకు మేలు చేసిన సీఎం వైఎస్​ జగన్​… సామాజిక న్యాయం పాటించారన్నారు. ఇప్పటి వరకు వైసీపీ, టీడీపీ లు ‘ రెడ్డి’ సామాజిక వర్గానికే  ఎమ్మిగనూరు టిక్కెట్​ ఇచ్చారు…మొదటిసారిగా పద్మశాలీ వర్గానికి చెందిన బుట్టారేణుకకు వైసీపీ టిక్కెట్​  ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి..సంక్షేమం..:

రాష్ట్ర అభివృద్ధిలో తన ప్రత్యేకతను చాటుకున్న సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి బాటలోనే…తాను నడుస్తానని స్పష్టం చేసిన వైసీపీ ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థి బుట్టారేణుక… నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నిత్యం అందుబాటులోనే ఉండి.. సేవ చేస్తానన్నారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుతోపాటు అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.

ప్రజాదరణ..ఆమోఘం…:

నియోజకవర్గ కేంద్రమైన ఎమ్మిగనూరుతోపాటు గోనెగండ్ల, నందవరం, నాగలదిన్నె, ఎమ్మిగనూరు రూరల్​లో విశేష ప్రజాదరణ వస్తోంది. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా వైసీపీ అభ్యర్థి బుట్టారేణుకకు బొట్టు పెట్టి… హారతి ఇవ్వడం చూస్తుంటే… గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి , సీనియర్​ నాయకులు రుద్ర గౌడ్​ సహకారంతో తనకు తిరుగులేదని, సీఎం జగనన్నకు తన గెలుపు కానుకగా ఇస్తానని పేర్కొన్నారు వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక.

ప్రత్యర్థి బలం అంచనా వేసి.. అడుగులు…:

 (బీజేపీ–జనసేన– టీడీపీ)కూటమి అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డి బరిలో నిలబడ్డారు. ప్రత్యర్థి అభ్యర్థి బలం అంచనా వేసి… అడుగులు వేస్తోంది.  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జయనాగేశ్వర రెడ్డితోపాటు  పద్మశాలి వర్గానికి చెందిన ఎంపీ డా. సంజీవ్​ కుమార్​,  సీనియర్​ నాయకులు కొంగతి లక్ష్మినారాయణ  టీడీపీ వైపు ప్రచారం చేసేందుకు పక్కా ప్లాన్​ రూపొందించారు.  ఎమ్మిగనూరు టిక్కెట్​ ఆశించి..నిరాశ పడిన డా. సంజీవ్​ కుమార్​ కూటమి ఎంపీ టిక్కెట్​కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా… కొంగతి లక్ష్మీనారాయణ ..జయనాగేశ్వర రెడ్డి గెలుపునకు సహకరించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రత్యర్థులు ఎవరున్నా… ఎంత మంది జతకట్టినా… తన గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేసిన బుట్టారేణుక… సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

About Author