PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతా .. పవన్ హెచ్చరిక !

1 min read

పల్లెవెలుగువెబ్ : వైసీపీ నేతలపై సన్నాసులు, ఎదవలు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… తాను లండన్ లోనో, న్యూయార్క్ లోనో పెరగలేదని… బాపట్లలో పుట్టానని.. గొడ్డుకారం తిన్నానని పవన్ అన్నారు. వీధి బడిలో చదువుకున్నానని చెప్పారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటున్నారని… మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండిరా ఎవడొద్దన్నాడు? అంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తొలి భార్యకు రూ. 5 కోట్ల డబ్బిచ్చానని, రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చానని, ఆ తర్వాతమూడో పెళ్లి చేసుకున్నానని, విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టెపినీలతో తిరిగే మీకేందిరా నేను చెప్పేది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కా పట్టుకుని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా కొడ..రా అని హెచ్చరించారు.

          

About Author