PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవ చేసే వాళ్లను ప్రోత్సహించాలి.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు:  ప్రజ‌ల‌కు సేవ చేసే వాళ్లను ప్రోత్సహిస్తే మ‌రింత సేవ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ఎం.ఎస్ ఫంక్షన్ హాల్‌లో యూ.ఎస్‌.ఏ ఎన్టీఆర్ ఫౌండేష‌న్ డైరెక్టర్ షా ఫ‌హాద్ స‌య్యద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. స్థానికుల‌కు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ఎంతో ఖ‌ర్చుపెట్టి రంజాన్ తోఫా అందించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. క‌ర్నూలు ప్రజ‌ల‌పై ఉన్న అభిమానం, ప్రేమ‌తోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నిర్వాహ‌కుల‌ను ఉద్దేశించి చెప్పారు. ఇదే స్థానికులు, స్థానికేత‌రుల‌కు ఉన్న వ్యత్యాసం అని.. దీన్ని ప్రజ‌లు గుర్తించాల‌ని పేర్కొన్నారు. మంచి చేసేందుకు ముందుకొస్తున్న వారిని ప్రజ‌లు ప్రోత్సహించాల‌న్నారు. సేవా కార్యక్రమాలు చేసే వారికి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డానికైనా తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాన‌ని టి.జి భ‌ర‌త్ తెలిపారు. ప్రస్తుతం క‌ర్నూల్ ప్రజ‌లు నీటి స‌మ‌స్యను ఎదుర్కొంటున్నార‌న్నారు. ముస్లింలంద‌రూ ఈ స‌మ‌స్య తీరాల‌ని అల్లాను ప్రార్థించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ నిరంజ‌న్, మాజీ తానా ప్రెసిడెంట్ జె.తాల్లూరి, తానా ఫౌండ‌ర్ ట్రస్టీ సురేష్‌, శ్రీనివాస్, కార్పొరేట‌ర్ ప‌ర‌మేష్‌, టిడిపి న‌గ‌ర అధ్యక్షుడు నాగ‌రాజు యాద‌వ్, టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యద‌ర్శి జహంగీర్ బాషా, మైనారిటీసెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రట‌రీ మ‌న్సూర్ ఆలీఖాన్, తెలుగుయువ‌త రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి ల‌క్కీటూ గోపినాథ్ యాద‌వ్‌, జ‌న‌సేన క‌ర్నూలు ఇంచార్జి అర్షద్, టిడిపి నాయ‌కులు ఇబ్రహీం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author