మూడేళ్ల ఎంసీఏ.. ఇక నుంచి రెండేళ్లే !
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/03/3308.jpg?fit=500%2C251&ssl=1)
పల్లెవెలుగువెబ్ : దేశంలో కొత్తగా కొన్ని డిగ్రీ కోర్సులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రారంభించింది. కొన్ని ప్రోగ్రామ్ల కోర్సు వ్యవధిని సవరించింది. అలాగే వివిధ డిగ్రీ ప్రోగ్రామ్ల అర్హతల్లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి నూతన విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని www.ugc.ac.in లో పొందుపరిచింది. యూజీసీ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పటిదాకా మూడేళ్లుగా ఉన్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు.