PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యాయవాద వృత్తిలో రాణించాలి …

1 min read

పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య

 పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: న్యాయవాద వృత్తిలో రాణించాలి అంటే నైపుణ్యం పెంచుకోవడం తో పాటు, నిరంతరం అధ్యయనం చేయాలని పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి వి.దివ్య న్యాయవాదులకు సూచించారు. గురువారం పత్తికొండ పట్టణంలోని బార్ అసోసియేషన్ లో నూతన న్యాయవాదులు గా ఉప్పర నాగరాజు, జూటూరు నాగభూషణం   సభ్యత్వం తీసుకున్నారు.  బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.రంగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్జి వి.దివ్య హాజరై మాట్లాడారు. న్యాయవాద వృత్తి  గౌరవ పదమైనదని, చట్టాల గురించి తెలుసుకొని ప్రజలకు  మెరుగైన న్యాయ సేవలు అందించాలని కోరారు. ప్రతిరోజు కోర్టుకు హాజరై కేసులకు సంబంధించిన ప్రతి విషయాలను అవగాహన చేసుకోవాలని అన్నారు . నూతన సభ్యుల కు సీనియర్, జూనియర్ న్యాయవాదులను పరిచయం చేశారు. పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కోశాధికారి మహేష్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ నాయుడు, ఈరన్న మల్లికార్జున, సత్యనారాయణ, బాలభాష, దామోదరాచారి, రవి ప్రకాష్, శ్రీకాంత్ రెడ్డి, నెట్టేకల్లు, నరసింహులు, భాస్కర్, కబీర్దాస్, రవి, లక్ష్మన్న, హరి తదితరులు పాల్గొన్నారు.

About Author