PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలుకు.. ‘నిమ్స్​’ రావాలి..

1 min read

– ఆదిశగా కృషి చేస్తా.. ఎంపీ డా. సంజీవ్​కుమార్​
– ఎంపీని సన్మానించిన మెడికల్​ కళాశాల బృందం
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు మెడికల్​ కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ డా. సంజీవ్​కుమార్​. సూపర్​ స్పెషాలిటీ విభాగంలో 5 కోర్సులలో 9 సీట్లు పెంపునకు విశేష కృషి చేసిన ఎంపీని మెడికల్​ కళాశాల వైద్య బృందం అభినందన కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలో పినాకపాణి హాల్​లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ కళాశాల బృందం ఘనంగా సన్మానించారు.

సూపర్​ స్పెషాలిటీ విభాగంలో ఐదు కోర్సులలో 9 సీట్లు వచ్చాయని.. త్వరలో మిగిలిన 3 కోర్సులలో సీట్లు తీసుకొచ్చేందుకు మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చారు. కర్నూలు మెడికల్​ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని, ఆదిశగా అడుగులు వేస్తే… నిమ్స్​ లాంటి ఆస్పత్రి కర్నూలుకు వస్తుందన్నారు. అనంతరం కార్డియాలజీ వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ మెడికల్​ కళాశాలకు సూపర్​ స్పెషాలిటీ సీట్లు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని, ఇందుకు కృషి చేసిన ఎంపీ డా. సంజీవ్​ కుమార్​కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తరువాత ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ను వైద్యకళాశాల బృందం శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్​ కళాశాల వైద్య సిబ్బంది, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author