PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతలపల్లిలో పశువులకు గర్భకోశ చికిత్సలు..

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పరిధిలోని చింతలపల్లి గ్రామంలో మంగళవారం పశువులకు చికిత్స శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా నందికొట్కూరు ఏడీ డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ పశువులకు వచ్చేటటువంటి రోగాల గురించి అదేవిధంగా రోగాలు వచ్చిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన రైతులకు వివరించారు.పశువులకు ఏమైనా రోగం వచ్చినట్లయితే కొద్దిగా ఉన్నప్పుడే రైతులు గుర్తించి వెంటనే పశు వైద్యశాలకు తీసుకురావాలని ఆ వెంటనే పశువులకు చికిత్స చేస్తే అలాంటి రోగాలు దూరం అవుతాయని అన్నారు. ఎదకురాని పశువులకు మరియు గర్భకోశ సమస్యలతో ఉన్న పశువులకు పశు వైద్యాధికారులు సాయినాథ్ రెడ్డి,చంద్రమోహన్ 55 పశువులకు చికిత్సలు చేశారు.   పశువులకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు డాక్టర్లు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది నరేష్,లిఖిత,విజయరాజు అనిత మరియు రైతులు పాల్గొన్నారు.

About Author