PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గిరిజనుల ఘర్షణ.. 200 మంది మృతి !

1 min read

పల్లెవెలుగువెబ్: ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని బ్లూనైల్ రాష్ట్రంలో జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక మీడియా తెలిపింది. దక్షిణ సూడాన్, ఇథియోపియో సరిహద్దులో ఉన్న బ్లూనైల్‌లో ఈ ఘర్షణలు రేకెత్తాయి. హౌసా, బెర్ట్ తెగల మధ్య తలెత్తిన భూ వివాదం చినికిచినికి గాలివానగా మారి ఇరు వర్గాల మధ్య పోరుకు దారితీసింది. కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుండడంతో వందలాది మంది ఇళ్లు విడిచి పారిపోతున్నారు. ఇరు వర్గాలు దుకాణాలను తగలబెట్టుకున్నాయి. బుధ, గురువారాల్లో ఈ ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి. దీంతో శుక్రవారం ఇక్కడ అత్యవసర పరిస్థితిని విధిస్తూ ప్రావిన్షియల్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

About Author