PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయచోటి లో… మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

1 min read

పల్లెవెలుగు బ్యూరో వెబ్  అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులోని లక్ష్మీపురం లో గల రాష్ట్ర బీసీ నాయకులు,నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.వండాడి వెంకటేశ్వర్లు ఇంటిలో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది ఇంటిలోకి చొరబడి జీపు అద్దాలతో పాటు ఇంట్లోనే వస్తువులను,కుర్చీలను ధ్వంసం చేసి పరారయ్యారు.విషయం తెలుసుకున్న డీఎస్పీ రామచంద్ర రావుతో పాటు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి,పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు నివాసానికి చేరుకుని జరిగిన సంఘటనపై అరాతీశారు.అక్కడ జరిగిన పరిస్థితిని సమీక్షించి వెంకటేశ్వర్లు నివాసంలోని సిసి పుటేజి కు సంబంధించిన డివిఆర్ ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.అయితే దాడికి పాల్పడిన వారు ఎవరనే విషయం ఇంకా తెలియలేదు.ఈ విషయమై వండాడి వెంకటేశ్వర్లును విచారిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది రౌడీముఖలు తాను ఇంట్లో లేని సమయంలో దొడ్డిదారిన ఇంట్లోకి వచ్చి వస్తువులను పగలగొట్టి వెళ్లినట్లు తెలుస్తోందని చెప్పారు.

About Author