PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర రైల్వే శాఖ మంత్రితో డా. పార్థసారధి భేటీ

1 min read

కర్నూలు జిల్లా అభివృద్ధికి సాయం చేయాలని అభ్యర్థించిన ఆదోని ఎమ్మెల్యే

కర్నూలు, పల్లెవెలుగు:కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను, కేంద్ర  ప్రభుత్వ సీనియర్ మంత్రి పీయూష్ గోయల్ ను  ఢిల్లీలో సోమవారం ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కేంద్ర మంత్రివర్గంలోకి చోటు దక్కించుకున్నందుకు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.  భవిష్యత్తులో కర్నూలు జిల్లా ఆదోని అభివృద్ధికి సహకరించాలని అభ్యర్థించగా… అందుకు  కేంద్రమంత్రులు​ అంగీకరించినట్లు డా. పార్థసారధి పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర  ప్రభుత్వ సీనియర్ మంత్రి బి ఎల్ వర్మ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాను బీసీ మోర్చాలో జాతీయ కార్యదర్శిగా ఉంటే, వర్మ  బీసీ మోర్చాలో ఉపాధ్యక్షులుగా ఏడాదిపాటు కలిసి పని చేసినట్లు గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్​ లో బీసీలకు అందుతున్న ప్రత్యేక పథకాలు ఆంధ్రప్రదేశ్ లో  కూడా అమలయ్యేలాగా చూడాలని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న బీసీల సమస్యల పట్ల కలిసి పోరాడుదామని  కేంద్ర  ప్రభుత్వ సీనియర్ మంత్రి బి ఎల్ వర్మకు వెల్లడించినట్లు ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

About Author