PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీకి కేంద్ర మంత్రి వార్నింగ్.. అలా కుద‌ర‌దు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు త‌మ‌కు ఇష్టమొచ్చిన పేర్లు పెట్టడం కుద‌ర‌ద‌ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు ఏపీలో జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, జ‌గ‌నన్న పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోష‌ణ లాంటి పేర్లు పెట్టడం పై కేంద్ర ప్రభుత్వం అభ్యంత‌రం తెలిపింది. 2021-22 సంవ‌త్సరానికి ఐసీడీఎస్, ఐసీపీఎస్ ప‌థ‌కాల‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 187 కోట్లకు లెక్క చూపాల‌ని రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు పేర్లు మార్చడం పై వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఫిర్యాదు చేయ‌గా.. కేంద్రమంత్రి స్మృతి ఇరాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు రాష్ట్రం ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకోవ‌డం కుద‌ర‌ద‌ని తెలిపారు. ఈ విష‌యం పై వెంట‌నే నివేదిక ఇవ్వాల‌ని కోరారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author