PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాటర్ ప్లాంట్ పనులు త్వరగా పూర్తి చేయాలి: డీఈఈ

1 min read

పల్లెవెలుగు వెబ్​:నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి  గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ పనుల ను ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ అమల పరిశీలించారు.అదేవిధంగా గ్రామంలో ఉన్న నీటి సమస్యల గురించి అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సూచించారు.వాటర్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.జగనన్న కాలనీలో నీటి సరఫరాను పరిశీలించి ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె అన్నారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ ఉషారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ విశ్వనాథ్,పంచాయితీ కార్యదర్శి సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాలయ్య పాల్గొన్నారు.

About Author