PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మమ్మల్ని చిత్ర హింసలకు గురి చేశారు..

1 min read

-పోలీసులూ మాకు న్యాయం చేయండి..

పల్లెవెలుగు  వెబ్ మిడుతూరు: నా తండ్రి నా ఇద్దరి అన్నలు మరియు కుటుంబ సభ్యులు మమ్మల్ని చిత్ర హింసలకు గురి చేస్తూ ఉన్నారని నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామానికి చెందిన న్యా మతుల్లా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.దేవనూరు గ్రామంలోఆదివారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన పేట జిక్రిమియా కు మృతుజావలి,అల్తాఫ్అహ్మద్, న్యామతుల్లా ముగ్గురు కుమారులు ఇద్దరి పెద్ద కుమారులకు తండ్రి ఆస్తి పంపకాలు చేశారు.చిన్నవాడు న్యామతుల్లాకు మీకు ఒక్క కూతురు ఉంది నీకు కుమారుడు లేడు కదా మీకు ఎందుకు ఆస్తి ఇవ్వాలి అంటూ మాపై అదేపనిగా నా తండ్రి మరియు నా ఇద్దరి అన్నలు వారి కుటుంబ సభ్యులు ఈనెల 12వ తేదీ సా.4 గంటలకు సమయంలో వారంతా మా ఇంటి దగ్గరకు వచ్చి న్యామతుల్లా ఈయన భార్య గౌసియా,కూతురు ఫాతిమా వీరిని నానా బూతులు తిడుతూ మాపై పెట్రోల్ పోసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారని మీరు ఉంటే మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని అదే రోజున రాత్రి మిడుతూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు.మేము భయపడి కర్నూలులో దాక్కున్నామని నాకు ప్రాణహాని ఉంది మాకు రావాల్సిన ఆస్తి మాకు వచ్చే విధంగా చూడాలని అదేవిధంగా మా కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేసిన జిక్రిమియా, మృతుజావలి అల్తాఫ్అహ్మద్ రఫీ షఫీ ముంతాజ్ శంషాద్ వీరు పైన పోలీసులు చర్యలు తీసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో నామతుల్లా, గౌసియా,కూతురు ఫాతిమా కన్నీటి పర్యంతమయ్యారు.

About Author