PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికార, ప్రతిపక్ష పార్టీలకు దడ పుట్టిస్తాం …ఎస్.డి.పి.ఐ.

1 min read

రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాల పోటీకి సిద్ధం.

వెలుగోడు లోశ్రీశైలంనియోజకవర్గ

కార్యకర్తల విస్తృత సమావేశం.

పల్లెవెలుగు వెబ్  వెలుగోడు : రాబోవు పార్లమెంట్, ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార ,ప్రతిపక్ష పార్టీలకు దడ పుట్టిస్తామని ఎస్ డి పి ఐ రాష్ట్ర అధ్యక్షులు అతావుల్లా ఖాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం అబ్దుల్లా బెగ్ లు అన్నారు. బుధవారం రాత్రి వెలుగోడు పట్టణ షాది ఖానాలో శ్రీశైలం నియోజకవర్గం ఎస్ డి పి ఐ కార్యకర్తల విస్తృత సమావేశాన్ని శ్రీశైలం నియోజకవర్గం ఇంచార్జ్ హుస్సేన్ భాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు స్థాయి నుండి పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలన్నారు. ఎస్ డి పి ఐ పార్టీ అంటే అందరి పార్టీ అని ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీల రాజ్యాంగ హక్కులను కాపాడుట దేశ అభివృద్ధి కోసం, దేశంలో శాంతి కోసం కృషి చేసే పార్టీ అన్నారు. తమ పార్టీలో అన్ని వర్గాలకు చెందినవారు రాష్ట్రస్థాయిలో వివిధ పదవుల్లో ఉన్నారని అన్నారు .ప్రతి ఒక్కరూ విద్యావంతులై రాజకీయ చైతన్యం కలిగి కేంద్ర రాష్ట్రాలలో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకొని దేశ ప్రగతి కోసం పాటుపడాలన్నారు. త్వరలోనే ఎంపీ ,ఎమ్మెల్యేల అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు యూనిస్, రాష్ట్ర కోశాధికారి ఫజు లు ల్లా జిల్లా నాయకులు ఆరిఫ్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా జిల్లా ఉపాధ్యక్షులు లింకన్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కలాం, నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు ముబారక్ ,ప్రధాన కార్యదర్శి మోయిన్, నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, వెలుగోడు మండల సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

About Author