PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మత్స్యకారులను కాపాడుకుంటాం..

1 min read

– బెస్త కార్పొరేషన్​ స్టేట్​ డైరెక్టర్​ శివ శ్యామల కుమారి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట గ్రామానికి చెందిన 16 మంది మత్స్యకారులు చేపలవేటకు వెళ్లారు. వారిని ఫారెస్ట్​ అధికారులు అరెస్ట్​ చేసి, బోర్డులను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చిన బెస్త కార్పొరేషన్​ స్టేట్​ డైరెక్టర్​ శివ శ్యామల కుమారి అక్కడకు వెళ్లి మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు నాగ ఎల్లయ్యను కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారుల అరెస్టు విషయమై శ్యామల శివ కుమారి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్​కు ఫోన్​లో విషయం చెప్పి.. 16 మంది మత్స్యకారులను విడిపించారు. అదేవిధంగా వారి బోర్డులను ఇప్పించారు. అంతేకాక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలలో 500 మంది మత్స్యకార కుటుంబాలకు న్యాయం జరిగేలా ఫారెస్ట్​ అధికారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మత్స్యకారులను విడిపించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్​కు బెస్త కార్పొరేషన్​ స్టేట్​ డైరెక్టర్​ శివ శ్యామల కుమారి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author