PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంతియాజ్​ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం..

1 min read

పార్టీలో విభేదాలు లేవు…

  • కర్నూలు ఎంపీ అభ్యర్థి రామయ్య

కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న ఏ.ఎండి. ఇంతియాజ్​ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ ఎంపీ అభ్యర్థి బి.వై. రామయ్య. సోమవారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి అధ్యక్షతన ఎస్వీ కాంప్లెక్స్​లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ 2019 మాదిరిగానే 2024లో కూడా కర్నూలు జిల్లాలో అన్ని చోట్ల వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డితోనే  తన రాజకీయ ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఆ తరువాత వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎ.ఎండి. ఇంతియాజ్​ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం.. అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని ఆకాంక్షించారు.  సమావేశంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

About Author

1 thought on “ఇంతియాజ్​ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం..

Comments are closed.