PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబుతోనే ముస్లింల‌కు సంక్షేమం.. అభివృద్ధి

1 min read

కర్నూలు టిడిపి అభ్యర్థి టిజి భరత్

గడ్డ వీధిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ముస్లింల‌కు అన్ని విధాలా మేలు చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీయేన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని గ‌డ్డలో వార్డు నాయకులు జవాద్, సిరాజ్ బృందం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు. ముస్లింలకు రోజా ఉపవాస దీక్షలు విరమింపజేసారు. గ‌తంలో చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో చేశార‌ని చెప్పారు. ఈ ఐదేళ్లలో ముస్లింలు ఎంతో న‌ష్టపోయారని తెలిపారు. దుల్హన్ ప‌థ‌కం ద్వారా మైనారిటీ యువ‌తుల వివాహానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రూ. 50వేలు అందించిన‌ట్లు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే ల‌క్ష రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చాక‌ నిబంధ‌న‌లు పెట్టి అంద‌కుండా చేశార‌ని పేర్కొన్నారు. జిల్లాలో ఉర్దూ యూనివ‌ర్శిటీని చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేయిస్తే ఈ ప్రభుత్వంలో నిర్మాణానికి అడుగులు ప‌డ‌లేద‌ని మండిప‌డ్డారు. రంజాన్ తోఫాను సైతం ఈ ప్రభుత్వం ఇవ్వలేద‌న్నారు. ఇప్పటికైనా ముస్లింలు ఈ ఐదేళ్లలో జ‌రిగిన ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించాల‌ని కోరారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వ‌స్తేనే ముస్లింల జీవితాలు బాగుప‌డ‌తాయ‌న్నారు. క‌ర్నూల్లో ముస్లింల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. ఎలాంటి ఆప‌దొచ్చినా ముందుంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, సీనియర్ నేతలు మన్సూర్ ఆలీఖాన్, హమీద్, వార్డు ఇంచార్జి ఇబ్రహీం, తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇంఛార్జీలు పాల్గొన్నారు.

About Author