PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరో కాక ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ ఏం చేసేవాడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ ప‌లు విష‌యాలను పంచుకున్నారు. నటుడిగా కెరీర్‌ ప్రారంభించక ముందు ఇండస్ట్రీలో పరిచయాలు పెరగడం కోసం తేజగారి దగ్గర సహాయ దర్శకుడిగా చేశాను. పూరి జగన్నాథ్‌గారు అయితే సహాయ దర్శకులకు మంచి జీతం ఇస్తారని, ఆయన వద్ద చేరమని నాన్నగారు చెప్పారు. పూరీగారి ఆఫీసుకు వెళ్లాను.. కానీ, ఆయన్ని కలవడం కుదరలేదు. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం తర్వాత కలిశాను. ‘లైగర్‌’ని తెలుగు సినిమాగానే చేద్దామనుకున్నాం. అయితే కథ మొత్తం విన్న తర్వాత దేశం మొత్తం ఈ కథ చెప్పొచ్చని అనిపించి, పాన్‌ ఇండియా సినిమాగా చేశాం అని చెప్పారు.

                                          

About Author