PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామంలో 40 కోట్ల అభివృద్ధి ఏది.. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గని గ్రామంలో 40 కోట్లతో అభివృద్ధి చేశామని వైసిపి నాయకులు గొప్పలు చెబుతున్నారని కాలనీలో పర్యటిస్తుంటే.4కోట్ల అభివృద్ధి కనపడటం లేదని మురికి కాలువలతో కాలనీలు దుర్గంధం వెదజల్లుతున్నాయని ఇదేనా వైసిపి నాయకుల అభివృద్ధి అని మంగళవారం నాడు సూపర్ సిక్స్ బాబు ష్యురిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని గని గ్రామంలో పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దత్తత గ్రామాలు అంటూ అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు టిడిపి కి అధికారమిస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తామని ఈసారి టిడిపి ఓటు వేసి గెలిపించాలని సూపర్ సిక్స్ పథకాలతో మహిళల జీవన విధానాన్ని సమూలంగా మార్చివేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా టిడిపి ప్రభుత్వం ప్రకటించిన మహాశక్తి పథకాలను డోర్ టు డోర్ తిరిగి మహిళలకు వివరించారు ఈ సందర్భంగా టిడిపి పార్టీ శ్రేణులు స్థానిక టిడిపి యువ నాయకుడు నాయకుడు హర్షవర్ధన్ ఆధ్వర్యంలో గౌరు చరితకు భారీ గజమాలతో మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు రానున్న రోజుల్లో టిడిపి పార్టీదే అధికారమని అందరూ కలిసికట్టుగా పనిచేసి పాణ్యం గడ్డలో గౌరు చరిత రెడ్డి ఘన విజయం సాధించేలా కృషి చేయాలని మాజీ ఎంపీపీ స్థానిక టిడిపి నాయకుడు వంగాల శ్రీనివాసరెడ్డి పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ  రెడ్డి . వంగాల  మురళీధర్ రెడ్డి . పంట రామచంద్రారెడ్డి. దుర్వేసి కృష్ణ యాదవ్. యువజన విద్యార్థి నాయకుడు శ్రీరాములు. బత్తుల సుభద్రమ్మ. ఓడ్డు లక్ష్మీదేవి. మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

About Author