PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏం నాయ‌నా.. ల‌డ్డూ టేస్ట్ మారిందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీకి గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పిన జనసేన అధినేత పవన్‌కి ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ అదాని ప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తున్నాడని ఆయన ఆరోపించారు. అమిత్ షా డైరెక్షన్‌లో ఆస్తులను అదానికి అప్పగిస్తున్నారన్నారు. మోడీ, అమిత్ షా, జగన్, అదాని కలిసి మాట్లాడుకుని రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్‌లో సీఎం జగన్ నడుస్తుంటే…ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ నాయకుల్ని అడుగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

                                     

About Author