PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్‌: ఏపీలో ఇటీవల గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ చేసేందుకు సిద్ధమవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే దాదాపు పది రోజుల్లో గ్రూప్ 2నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిలబస్ ను మాత్రం అలాగే కొనసాగించాలన్న నిర్ణయానికి ఏపీపీఎస్సీ వచ్చినట్లు సమాచారం. కానీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ విధానంలో మాత్రం మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీపీఎస్సీ పంపించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. సర్కార్ నుంచి ఆమోదం లభించిన వెంటనే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఏపీపీఎస్సీ పూర్తి చేసినట్లు సమాచారం.

                                        

About Author