PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సంక్షేమం కోసం టీడీపీ జనసేన కూటమిని గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమిని ప్రజలు గెలిపించాలని రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య అన్నారు. బుధవారం నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సి సెల్ ఆర్గనైజింగ్  సెక్రెటరీ గిత్త జయసూర్య  ఆధ్వర్యంలో ముసలమడుగు,  ఎర్రమఠం గూడెంలో   టిడిపి నాయకుల తో కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు  ప్రకటించిన మినీ మానిఫెస్టో గురించి నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య  ప్రజలకు వివరించారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా టిడిపి జనసేన కూటమికి అండగా నిలిచి భారీ విజయాన్ని అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో  మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,కన్వీనర్ నారపురెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ లింగస్వామి గౌడ్ ,పరమేశ్వర రెడ్డి,శీలం లింగన్న,వెంకటస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, జహురుల్లా ,జెడ్ వెంకట రెడ్డి,బుచ్చిరెడ్డి,శివారెడ్డి,రాజు,రమణారెడ్డి,రామకృష్ణ రెడ్డి,మాడుగుల శేఖర్ ,మారేన్న,జానాల గూడెం సుధాకర్ ,వెంకటేష్ ,సుబ్బయ్య గౌడ్,చంద్ర గౌడ్,రాధాకృష్ణ రెడ్డి,శరీఫ్ బాష ,చెంచు శివలింగమ్మ,గూడెం మహేశ్వర రెడ్డి, గూడెం తక్కయ్య,గూడెం నాగన్న,దుర్గం అంకాలి,రామకృష్ణ రెడ్డి,సీమల గోపాల్ రెడ్డి,షఫీవుళ్ళ,ప్రశాంత్ కుమార్ రెడ్డి,యూనిట్ ఇంచార్జ్ రహీంఖాన్ ,శివశంకర్ రెడ్డి, కుమ్మరి లక్ష్మన్న,బోయ రమణయ్య, రాజు,శివారెడ్డి,బుచ్చి రెడ్డి,జనాలగూడెం సుధాకర్, జహీర్, మన్సూర్ బాష, మక్తర్, పగిడ్యాల మాబాష, పలుచాని మహేశ్వర రెడ్డి,పురుషోత్తం రెడ్డి,జమీల్ ,రసూల్ ,షమీర్,జావీద్,పాలబాబు, మాబాష తదితరులు పాల్గొన్నారు.

About Author