PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మద్దతు తో 40 మెజార్టీ తో గెలుస్తా

1 min read

ఎమ్మిగనూరు వైకాపా ఇన్చార్జ్ బుట్టరేణుక

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మద్దతు తో 40 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గా గెలవడం ఖాయమని ఎమ్మిగనూరు వైకాపా ఇన్చార్జ్ బుట్టరేణుక ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు భర్త నీలకంఠప్పతో కలిసి వచ్చారు. వీరి కి మఠం అధికారులు స్వాగతం పలికారు. వీరు ముందు గా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకుని, రాఘవేంద్ర స్వామి మూల బృందావనం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిస్తాయని తెలిపారు. ప్రజల వద్దకే పాలన సాగుతోందని తెలిపారు. వై నాట్ 175 టార్గెట్ ను అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు లో టీడీపీ పార్టీ ఎవరిని నిలబెట్టిన ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మద్దతు తో గెలుపు నాదే అన్నారు.ముందుగా శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల తో కాసేపు మాట్లాడారు.

About Author