NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్పంచ్ అభ్యర్థులకు రాతపరీక్ష !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఒడిశాలోని ఓ గ్రామంలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సుందర్ గఢ్ జిల్లా కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో సర్పంచి అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించారు. కుత్రా పంచాయతీ సర్పంచి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను ములుపడ గ్రామస్థులు సమావేశపరిచారు. తాము పెట్టే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఓట్లేస్తామని చెప్పడంతో 8 మంది రాత పరీక్షకు సిద్ధమయ్యారు. దీంతో 7 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం వారికి అందజేశారు. ఈ రాత పరీక్షలో ముగ్గురు ఉత్తీర్ణులు కాగా.. ఐదుగురు ఫెయిలైనట్టు గ్రామస్థులు ప్రకటించారు. ఈ ముగ్గురిలో గ్రామస్థులు ఎవరికి ఓటు వేయనున్నారన్న ఆసక్తి నెలకొంది.

          

About Author