PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాదవ ఆత్మీయ మహాసభ ను జయప్రదం చేయండి

1 min read

– ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఈనెల నాలుగో తేదీన కడప నగర శివారులోని డి ఎస్ ఆర్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే కమలాపురం నియోజకవర్గ యాదవుల ఆత్మీయ మహా సభను జయప్రదం చేయాలని ఎంపీపీ చీర్ల సురేష్ బాబు తెలిపారు, గురువారం ఆయన స్థానిక ఎంపీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కమలాపురం నియోజకవర్గం లోని యాదవులందరినీ ఒక తాటి పైకి తీసుకువచ్చి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సభను నిర్వహించడానికి వైసీపీకి సంబంధించిన యాదవ నాయకులు అందరూ నిర్ణయించడం జరిగిందని తెలిపారు, వైయస్సార్ జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గానికి పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవులు ఇచ్చినటువంటి ఘనత ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు, కాబట్టి మరో మారు ఆయనను ముచ్చటగా మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆయన తెలియజేశారు, నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగిన వైసీపీ యాదవుల నాయకుల ద్వారా మన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకోవడానికి నియోజకవర్గ యాదవ నాయకులను అందరము కలిసి బాధ్యత తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ ఆత్మీయ సభకు గ్రామపంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాదవ నాయకులు అందరూ పాల్గొంటారని ఆయన తెలిపారు, కమలాపురం నియోజకవర్గం లోని యాదవ బంధువులందరూ ఈ ఆత్మీయ మహాసభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.

About Author