PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పది ఫీజు కట్టక పోయినా పరీక్ష రాయొచ్చు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పదవ తరగతి ఫీజు కట్టకపోయినా సరే పది అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాయవచ్చని మిడుతూరు మండల విద్యాశాఖ అధికారి రామిరెడ్డి మంగళవారం అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు ఉ.9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు ఉన్నాయని 2022 మార్చి మరియు 2023 మార్చ్ లో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫెయిల్ అయిన వారు ఉంటే వారు పరీక్ష ఫీజు చెల్లించకపోయినా వారి హాల్ టికెట్లు విద్యార్థులు ఏ పాఠశాలలో అయితే పదవ తరగతి చదివారో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల దగ్గర హాల్ టికెట్లను తీసుకొని పరీక్షకు హాజరు కావాలని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అంతే కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి సిలబస్ మారుతూ ఉందని వీటిని విద్యార్థులు గమనించాలని ఎంఈఓ రామిరెడ్డి విద్యార్థులను కోరారు.

About Author