PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిని గెలిపించేందుకు యువ‌త క‌ష్ట‌ప‌డాలి.. క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో 18వ వార్డు జొహ‌రాపురానికి చెందిన మ‌హిళ‌లు, యువ‌కులు.. టిడిపి యువ నాయ‌కుడు ఆనంద్ యువ‌సేన‌ ఆధ్వ‌ర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ తాను గెలిచిన వెంట‌నే జొహ‌రాపురాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాన‌ని తెలిపారు. యువ‌త ఈ రెండు నెల‌లు క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు. తాను గెల‌వ‌డం వ‌ల్ల క‌ర్నూలు మొత్తం బాగుప‌డుతుంద‌ని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో స‌తీష్‌, భ‌ర‌త్‌, అశోక్‌, గిరి, త‌దిత‌రులు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నేత బాబ్జీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author