PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేకా హత్య కేసు.. 21న కీలక తీర్పు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నెల 21న తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ పూర్తి కాగా…తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం (నవంబర్ 14)న ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ అంశం సోమవారం జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై తీర్పును వచ్చే సోమవారం ప్రకటిస్తామని జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. బెంచ్ లోని మరో న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగానే ఈ వ్యవహారంపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కూడా జస్టిస్ ఎంఆర్ షా ఈ నెల 21కి వాయిదా వేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి కింది కోర్టులో బెయిల్ పొందారు. ఈ బెయిల్ ను ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. ఫలితంగా సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

About Author