PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉమ్మడి కర్నూలు జిల్లా లో మళ్లీ వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేయబోతుంది

1 min read

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు మళ్ళీ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు

కర్నూలు జిల్లా వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షురాలు శ్రీ మతి సీత్ర సత్యనారాయణమ్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రీజినల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ,కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సీత్ర సత్యనారాయణమ్మ  కలిసి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి బి.వై రామయ్యా ని,మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు కర్నూల్ ఇంతియాజ్ ని,  కోడుమూరు సతీష్ ని, నందికొట్కూరు ధర సుధీర్ ని, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి ని,పత్తికొండ శ్రీదేవి  ని, ఆలూరు విరుపాక్షి  ని బి౼ఫోరమ్ పత్రాలను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ  మాట్లాడుతూ జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించి నా చేతుల మీదుగా బి-ఫామ్ పత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 2019లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలాగైతే వైస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసిందో మళ్ళీ ఇపుడు వైస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అన్ని అన్నారు.అలాగే కర్నూలు జిల్లా ప్రజలు వైఎస్ఆర్సిపి అభ్యర్థులను వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆశీర్వదిస్తారని అన్నారు. మళ్లీ మన పార్టీ అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమం లో కర్నూలు మాజీ ఎమ్మెల్యే యస్.వి మోహన్ రెడ్డి ,కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ,సీనియర్ నాయకులు గడ్డం రామకృష్ణ ,సి.హెచ్ మద్దయ్య , బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటా సాయినాథ్ ,ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.

About Author