PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీలో  చేరిన వైఎస్సార్‌టీయూసి మున్సిప‌ల్ వ‌ర్కర్స్ యూనియ‌న్

1 min read

టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో పార్టీలో చేరిన ప‌లు యూనియ‌న్ల నాయ‌కులు

త‌మ ప్రభుత్వం వ‌చ్చాక‌ కార్మికుల స‌మ‌స్యలు ప‌రిష్కరిస్తామ‌న్న టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: త‌మ ప్రభుత్వం వ‌చ్చాక కార్మికుల స‌మ‌స్యలు ప‌రిష్కరిస్తామ‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో వైఎస్సార్‌టీయూసి మున్సిప‌ల్ వ‌ర్కర్స్ యూనియ‌న్ అధ్యక్షుడు వై.వి ర‌మ‌ణ‌తో పాటు మున్సిపాలిటీ రెగ్యుల‌ర్ యూనియ‌న్, మున్సిపాలిటీ ఆప్కాస్ యూనియ‌న్, ఇంజినీరింగ్ సెక్షన్ రెగ్యుల‌ర్, ఆప్కాస్ యూనియ‌న్, జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ ఆప్కాస్ వ‌ర్కర్లు, రైల్వే ఆప్కాస్ వ‌ర్కర్ల నాయ‌కులు, సిబ్బంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ‌ర్గాలు న‌ష్టపోయాయ‌న్నారు. తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జ‌రుగుతుంద‌ని తెలుసుకొని పార్టీలో చేరిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌మ ప్రభుత్వం రాగానే కార్మికుల స‌మ‌స్యలు ఒక్కొక్కటికీ ప‌రిష్కరించే దిశ‌గా ముందుకు వెళ‌తామ‌ని పేర్కొన్నారు. రోజురోజుకూ తెలుగుదేశం పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతోంద‌న్నారు. ప్రజ‌లంద‌రూ ఈ ఐదేళ్ల పాల‌న చూసి విసిగిపోయార‌న్నారు. పార్టీలో చేరిన వారిలో ఎం.వి నారాయ‌ణ‌, స్వాములు, పి. వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఎస్. ప్రభాక‌ర్ రెడ్డి, ర‌త్నం, సి. రాజు, నాగ‌రాజు, చంద్ర‌, సి. ర‌మేష్‌, ల‌క్ష్మయ్య‌, త‌దిత‌రులు ఉన్నారు.వైఎస్సార్‌టీయూసి మున్సిప‌ల్ వ‌ర్కర్స్ యూనియ‌న్ అధ్యక్షుడు వై.వి ర‌మ‌ణ మాట్లాడుతూ క‌ర్నూలు ప్రజ‌ల‌కు సంక్షేమంతో పాటు అభివృద్ధి అందించాల‌న్న ల‌క్ష్యంతో రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న టి.జి భ‌ర‌త్‌కు మ‌ద్దతు తెలుపుతున్నామ‌న్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో త‌మ స‌మ‌స్యలు ప‌రిష్కరించుకుంటామ‌న్నారు. క‌ర్నూల్లో టి.జి భ‌ర‌త్ బాట‌లో ప‌య‌నిస్తామ‌ని పేర్కొన్నారు. నిస్వార్తంగా సేవ చేసే టి.జి భ‌ర‌త్‌ను తామంతా క‌ష్టప‌డి గెలిపించుకుంటామ‌న్నారు.

About Author